ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిని విచారించిన సిట్ అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 31, 2025, 02:50 PM

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ఈ కేసులో భాగంగా టీటీడీ పాలకమండలి సభ్యురాలు, నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిని సిట్ అధికారులు విచారించారు. తిరుపతి నుంచి ప్రత్యేక బృందంగా నెల్లూరులోని ఆమె నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు రోజంతా సుదీర్ఘంగా ప్రశ్నలు సంధించారు. టీటీడీలో ఆమె నిర్వహించిన బాధ్యతలు, అప్పటి కొనుగోళ్ల విధానాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.వైసీపీ ప్రభుత్వ హయాంలో నాలుగు నెలల పాటు ప్రశాంతి టీటీడీ కొనుగోళ్ల కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆ సమయంలో కమిటీ ఎలా పనిచేసేది, కొనుగోళ్లపై ఎవరి నిర్ణయాలు ఉండేవి, సభ్యుల పాత్ర ఏమిటన్న అంశాలపై సిట్ అధికారులు వివరాలు సేకరించారు. ముఖ్యంగా అప్పట్లో నెయ్యి సరఫరాకు సంబంధించి ఏమైనా అనుమానాలు, ఫిర్యాదులు మీ దృష్టికి వచ్చాయా? అనే ప్రశ్నలు వేసినట్లు సమాచారం.ఈ అంశాలపై స్పందించిన ప్రశాంతి... తాను కేవలం నాలుగు నెలలపాటు మాత్రమే పర్చేజ్ కమిటీలో ఉన్నానని, టీటీడీ కొనుగోళ్ల వ్యవహారాలపై పూర్తిస్థాయి అవగాహన తనకు లేదని చెప్పినట్లు తెలిసింది. ఆరున్నరేళ్ల కింద జరిగిన విషయాలను ఇప్పుడు గుర్తు చేసుకోవడం కష్టమని కూడా ఆమె వ్యాఖ్యానించినట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa