ముంబైలో కరోనా వైరస్ వ్యాప్తి తారాస్థాయికి చేరింది. దీంతో ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. రోగులకు బెడ్లు, వసతులు సరిపోకపోవడం పెద్ద సమస్యగా మారింది. తాజాగా తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఆక్సిజన్ సదుపాయం లేకపోవడంతో కేవలం గంటన్నర వ్యవధిలో ఏడుగురు కరోనా బాధితులు మృత్యువాతపడ్డారు. బృహన్ ముంబై కార్పొరేషన్ నడుపుతున్న జోగేశ్వరి ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాజా మరణాలతో ఇదే ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా చనిపోయిన కరోనా రోగుల సంఖ్య 19కి చేరడం ఆందోళనను కలిగిస్తోంది. జోగేశ్వరి ఆస్పత్రిలో ఆక్సిజక్ కొరత కారణంగా గత రెండు వారాలుగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం మరో ఏడుగురు మరణించారు. వీరిలో కరోనా నుంచి కోలుకుంటున్న వారు కూడా ఉండటం విషాదకరం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa