ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ జరగకుంటే బీసీసీఐకి భారీ నష్టం.. ఎంతంటే..

national |  Suryaa Desk  | Published : Sun, Jun 07, 2020, 11:00 AM

క్రికెట్ ప్రేమికులకు ఎంతో ఆనందాన్నిచ్చే ఐపీఎల్... బీసీసీఐకు ఎంతో ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. దశాబ్దానికి పైగా ఐపీఎల్ నిర్వహిస్తున్న బీసీసీఐ... ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించే విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు. ఒక దశలో ఇండియాలో ఐపీఎల్ నిర్వహణ కుదరకుంటే విదేశాల్లో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించిన చరిత్ర సైతం ఉంది. అలాంటి కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ వాయిదా పడడం... బీసీసీఐకి చాలా ఇబ్బందిగా మారింది. ఒకవేళ ఈ ఏడాది ఐపీఎల్ జరగకపోతే బీసీసీఐకు రూ. 3500 కోట్ల నష్టం వచ్చే ప్రమాదం ఉందని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే ఆ తర్వాత బీసీసీఐ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేమన్నారు. దీనిపై తదుపరి నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర అధ్యయనం చేయనున్నామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa