ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేదాద్రి ఎత్తిపోతల పథకానికి సీఎం వైయస్‌.జగన్‌ శంకుస్థాపన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 28, 2020, 12:53 PM

అమరావతి: వైయస్సార్‌ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ శంకుస్థాపన. వీడియో లింక్‌ ద్వారా శంకుస్థాపన చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌. శంకుస్థాపన కార్యక్రమంలో వేదాద్రి నుంచి పాల్గొన్న మంత్రులు అనిల్‌కుమార్‌యాదవ్, పేర్నినాని, కొడాలినాని, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మొండితోక జగన్‌మోహన్‌రావు, కైలే అనిల్‌కుమార్, మహిళా కమిషన్‌  ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ తదితరులు*


సీఎం మాట్లాడుతూ  ...రాష్ట్ర విభజన తర్వాత విజయవాడకు అతిసమీపంలోని, కృష్ణాజిల్లాలోని నందిగామ, వత్సవాయి, పెనుగంచి ప్రోలు, జగ్గయ్యపేట ప్రాంతాల్లో తాగునీటికి, సాగునీటికి కటకటలాడే పరిస్థితి ఉంది. 5 ఏళ్లపాటు అధికారంలో ఉండికూడా, ఈ ప్రాజెక్టు చేస్తే మంచి జరుగుతుందని తెలిసినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే, 14 నెలల్లోపు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాన చేశాం ఫిబ్రవరి 2021 నాటికల్లా ఈప్రాజెక్టును పూర్తిచేయాలని దృఢసంకల్పంతో లక్ష్యంగా పెట్టుకున్నాం నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వనుంచి ఈప్రాంతానికి అందాల్సిన నీరు అందడంలేదు.. దీనికి పరిష్కారంగా ఈ ప్రాజెక్టును చేపట్టాం ఈ ప్రాంతంలోని 38,627 ఎకరాలకు నీరు అందిస్తాం డీబీఆర్‌ బ్రాంచ్‌ కెనాల్‌ పరిధిలోని 30 గ్రామాలకు, వాటితోపాటు జగ్గయ్యపేట మున్సిపాలిటీకి కూడా వైయస్సార్‌ వేదాద్రి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం ద్వారా నీరు అందిస్తాం దాదాపు 2.7 టీఎంసీల నీటిని ఈ ప్రాంతానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం రూ. 490 కోట్లు ఖర్చు చేస్తున్నాం ఈప్రాజెక్టుద్వారా నీటికటకట తీరి, ఈ ప్రాంతానికి మంచి జరగాలని కోరుకుంటూ.. నాకు ఈ అవకాశం కల్పించిన దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa