ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళల ఉపాధికి కుట్టుమిషన్లతో కేంద్రం చేయూత

national |  Suryaa Desk  | Published : Sat, Aug 29, 2020, 06:37 PM

మహిళలు తమ కాళ్లపై తాము నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం మంచి అవకాశాలను అందిస్తుంది. రకరకాల పథకాలతో చేయూతనిస్తుంది. వ్యాపారాల్లో రాణించేవారికి లోన్లు, చేతిలో ఏదైనా విద్య ఉన్నవాళ్లకు సంబంధిత పరికరాలు ఉచితంగా ఇచ్చి ప్రోత్సహిస్తుంది. అలాంటి పథకం ప్రధాన మంత్రి ఫ్రీ సిలై మెషిన్ యోజనా పథకం.ఈ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. దీని ద్వారా పేద కుటుంబాల మహిళలు ఉపాధి పొందే అవకాశం ఉంది. తమ ఇంట్లోనే ఉంటూ పని చేసుకుని డబ్బు సంపాదించవచ్చు. ఈ స్కీమ్ ద్వారా లక్షలాది మంది మహిళలు లబ్ధి పొందవచ్చు. 20 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు దీనికి అర్హులు. వార్షిక ఆదాయం రూ.12000 మించని కుటుంబాల మహిళలు దీనికి అర్హులు. రూరల్, అర్భన్ సిటీలకు చెందిన మహిళలు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ పథకం గుజరాత్, హార్యానా, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో అమల్లో ఉంది. రానున్న రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో అమలు కానుంది.ఈ పథకానికి అప్లై చేయడానికి india.gov.in అఫిషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లికేషన్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు ఫారంలో అభ్యర్థుల వివరాలు అన్ని ఫిల్ చేయాలి. అలాగే ఎందుకు మిషన్ కావాలనుకుంటున్నారో కారణం కూడా తెలియజేయాలి. ఆధార్ కార్డు, వయస్సు, ఆదాయ ధృవీకరణ పత్రాలు, వైకల్యం ఉంటే వైద్య ధృవీకరణ పత్రం, ఒక మహిళ వితంతువు అయితే, ఆమె నిరాశ్రయులైన వితంతు ధృవీకరణ పత్రం, కమ్యూనిటీ సర్టిఫికేట్ , పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను అటాచ్ చేయాలి. అనంతరం ఈ పత్రాలను స్థానిక స్థానిక సంబంధిత కార్యాలయానికి సమర్పించాలి.ఈ పథకం కింద ప్రతి రాష్ట్రంలో 50 వేలకు పైగా మహిళలకు ఉచిత కుట్టు యంత్రాలు ఇవ్వనున్నారు. ఆర్థికంగా బలహీనమైన మహిళలను శక్తివంతం చేయడం, వారిని ఉపాధి వైపు నడిపించడమే ఉచిత కుట్టు యంత్ర పథకం లక్ష్యం. ఈ స్కీమ్ గ్రామీణ మహిళల పరిస్థితిని కూడా మెరుగుపరుస్తుంది. ఈ పథకాన్ని ముందు ముందు తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. త్వరలో ఇక్కడి మహిళలకు ఈ అవకాశం రానుంది.చేతిలో విద్య ఉండి చేయడానికి అవసరమైన పరికరాలు లేని మహిళలు ఎందరో ఉన్నారు. వారంతా నిరాశలో బతుకు జీవిస్తున్నారు. అలాంటివాళ్లకు ఈ వార్త కచ్చితంగా శుభవార్తే. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa