ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రిక్స్ సదస్సుకు పూర్తి సహకారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 07, 2017, 04:07 PM

బెర్లిన్ : చైనాలో జరిగే బ్రిక్స్ సదస్సుకు భారత్ పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. మోడీ జర్మనీలో పర్యటిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న జి20 సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బ్రిక్స్ సదస్సు నిర్వహిస్తున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జిన్‌పింగ్ అధ్యక్షతన బ్రిక్స్‌లో మరింత ఊపందుకుందని ఆయన పేర్కొన్నారు. భారత్ శాంతికాముక దేశమని, ప్రపంచ దేశాలన్నీ శాంతి మార్గంలోనే పయనించాలని ఆయన ఆకాంక్షించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa