భారత్-వెస్టిండీస్ మధ్య ఆదివారం జరిగిన ఏకైక టీ20లో భారత్ 9 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్తో టీమిండియా వెస్టిండీస్ పర్యటన ముగిసింది. ఐదు వన్డేలు, ఏకైక టీ20 కోసం భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం వెస్టిండీస్ పయనమైన సంగతి తెలిసిందే.
ఐదు వన్డేల సిరీస్ను 3-1తో చేజెక్కించుకున్న భారత్.. ఏకైక టీ20లో పేలవ ఫీల్డింగ్ ప్రదర్శనతో మ్యాచ్ని చేజార్చుకుంది. జమైకాలోని కింగ్స్టన్లో ఇరు జట్ల మధ్య ఆదివారం టీ20 మ్యాచ్ జరిగింది. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ స్వస్థలం జమైకా. ఐపీఎల్ కారణంగా భారత్-వెస్టిండీస్ జట్ల ఆటగాళ్ల మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొంది. గేల్, బ్రావో సోదరులు ఐపీఎల్లో ఆడుతున్నారు. దీంతో టీమిండియా ఆటగాళ్ల కోసం గేల్ తన ఇంట్లో ప్రత్యేక విందు కార్యక్రమం ఏర్పాటు చేశాడు. మ్యాచ్ అనంతరం భారత జట్టు ఆటగాళ్లు, సిబ్బంది గేల్ ఇంటికి వెళ్లి సరదాగా గడిపి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ఆటగాడు రహానె.. గేల్తో కలిసి దిగిన ఫొటోను సోషల్మీడియా ద్వారా అభిమానులతో పంచుకుని డిన్నర్కి ఆహ్వానించినందుకు గేల్కి ధన్యవాదాలు తెలిపాడు.
వన్డే సిరీస్ జరుగుతున్న సమయంలో డ్వేన్ బ్రావో టీమిండియా ఆటగాళ్లకు ప్రత్యేక విందు కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నెల 26 నుంచి భారత్-శ్రీలంక మధ్య టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa