కస్టమర్ల నుంచి బలవంతంగా సర్వీస్ చార్జ్ వసూలు చేయాలని చూస్తే, రెస్టారెంట్ యజమానులు జైలుకు వెళ్లాల్సిందేనని కేంద్రం హెచ్చరికలు చేసింది. సర్వీస్ చార్జ్ ని టిప్పుగానే పరిగణించాలని, కస్టమర్లు ఇస్తే తీసుకోవాలే తప్ప ఒత్తిడి చేస్తే మాత్రం జైలుకు పంపుతామని హెచ్చరిస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది. సర్వీస్ ఛార్జీలు చట్టబద్దం కాదని, వారు దయతలచి ఇస్తే తీసుకోవాలని పేర్కొంది. అంతే కాదు దీనిపై ప్రజలు కోర్టును ఆశ్రయించవచ్చని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి అవినాశ్ కే శ్రీవత్సవ తెలిపారు. కేంద్ర విడుదల చేసిన మార్గదర్శకాలు ఏప్రిల్ 23 నుంచి అమల్లోకి వచ్చాయని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే న్యాయస్థానాలకు ఆశ్రయించాలని పేర్కొన్నారు.
అయితే సర్వీస్ చార్జ్ వసూలు చట్టాలను అతిక్రమించడం కాదని నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) సెక్రటరీ జనరల్ ప్రకుల్ కుమార్ వ్యాఖ్యానించారు. కేంద్రం మార్గదర్శకాలంటూ విడుదల చేస్తున్న నిబంధనలు చట్టాలేమీ కాదని, ఇవి వినియోగదారులను అయోమయానికి గురిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. రెస్టారెంట్లు వసూలు చేసే సర్వీస్ ఛార్జీలు చట్టబద్ధమైనవని, చట్టం నిబంధనలను ఉల్లంఘించడం కాదని ప్రకుల్ మరోసారి పునరుద్ఘాటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa