ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ పోలీస్ కానిస్టేబుల్ కన్న తల్లిదండ్రులను గొడ్డలితో నరికి చంపి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఖర్ఖైదా పోలీస్స్టేషన్ ఎస్ హెచ్వో ఇన్స్పెక్టర్ బిజేంద్ర సింగ్ తెలిపిన వివరాల ప్రకారం కానిస్టేబుల్ దీపక్(39) అతని ఇంటిలోని ఒక గదిలో అచేతనస్థితిలో ఉండటం చూసిన స్థానికులు తమకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. లోపలికి వెళ్లి చూడగా అతని తల్లిదండ్రుల మృతదేహాలు కూడా పక్కనే ఉన్నాయని తెలిపారు.
వారి వయసు 65 సంవత్సరాలు ఉండవచ్చని, వారి తలపై గొడ్డలితో మోదినట్లు గాయాలున్నాయని పేర్కొన్నారు. మరోవైపు దీపక్ గదిలో గొడ్డలి లభ్యమైనట్లు తెలిపారు. గొడ్డలిపై రక్తపు మరకలు ఉండటంతో..దీపక్ తన తల్లిదండ్రులను గొడ్డలితో నరికిన తరువాత వారిపై పెట్రోల్ పోసి తగలబెట్టాడని తెలిపారు. తరువాత దీపక్ విషాహారం తిని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యలకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa