ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎపి లో పంచాయతీ ఎన్నికల పోరు ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 09, 2021, 09:51 AM

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ లో పంచాయతీ ఎన్నికల పోరు నేడు ప్రారంభమయింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం తొలిదశ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికలు ఈరోజు ఉదయం 6.30 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.


తూర్పు గోదావరి మండల కేంద్రమయిన కిర్లంపూడిలో ఈరోజు ఉదయం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ఆయన అనుచరులు ఓటేశారు.


 


అన్ని ఏర్పాట్లు చేశాం : గోపాల్‌ కృష్ణ ద్వివేది


రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్‌ కృష్ణ ద్వివేది మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో జరగనున్న తొలిదశ పంచాయతీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. మంగళవారం మొత్తం 3,249 పంచాయతీలో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఇప్పటికే 525 స్థానాలు ఏగ్రీవం అయ్యాయి. మిగిలిన 2723 స్థానాలకు 7506 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 32,502 వార్డ్‌ మెంబర్లకు గాను 12,185 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి' అని వెల్లడించారు.


20,157 వార్డు మెంబర్లకు మొత్తం 43,601 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారని తెలిపారు. ఎన్నికల కోసం మొత్తం 29,732 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామని, వీటిలో 3,458 సెన్సిటివ్‌, 3,594 హైపర్‌ సెన్సిటివ్‌ పోలింగ్‌ స్టేషన్లు గుర్తించామని పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి తెలిపారు.


ఎన్నికల నిర్వహణ కోసం.. 1,130 స్టేజ్‌ ఒక రిటర్నింగ్‌ ఆఫీసర్‌లు, 3,249 స్టేజ్‌ ఇద్దరు రిటర్నింగ్‌ ఆఫీసర్లు, 1,432 అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, 33,533 మంది ప్రిసైడింగ్‌ అధికారులతో పాటు 44,392 మంది ఇతర పోలింగ్‌ సిబ్బంది పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల ద్వారానే ఓటర్లకు నోటా అవకాశాన్ని తొలిసారి తీసుకురానున్నారు. ఇక, గుంటూరు, చిత్తురు ఏకగ్రీవాలపై ఎలక్షన్‌ కమిషన్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఎస్‌ఇసి నుంచి ఆదేశాలు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని గోపాల్‌ కృష్ణ ద్వివేది వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa