ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడప జిల్లాలో దారుణం..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 09, 2021, 02:07 PM

కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నగర శివారుల్లోని ఇందిరానగర్ దగ్గర వివాహితపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇందిరానగర్‌కు చెందిన ఓ మహిళ కడప రిమ్స్ ఆస్పత్రికి వెళ్ళి తిరిగి వస్తుండగా అటకాయించి కొండల్లోకి తీసుకెళ్ళి అత్యాచారం చేశారు. నలుగురు యువకులు మహిళను దౌర్జన్యంగా లాక్కెళ్ళినట్లు స్థానికులు చెప్తున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ నిర్వహిస్తున్నారు. పోలీసుల అదుపులో నిందితులున్నట్లు సమాచారం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa