విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కొట్టేయడానికి తెరవెనుక సీఎం జగన్ రంగం సిద్ధం చేసుకున్నారని మంగళవారం మీడియా సమావేశంలో బొండా ఉమ అన్నారు. తెరముందు మాత్రం కేంద్రానికి లేఖలు రాశానంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమ ధ్వజమెత్తారు. 2019 అక్టోబర్ 29న జగన్ తన నివాసంలో దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీతో చర్చలు జరిపారని ఆరోపించారు. 2 లక్షల కోట్ల విలువైన ఉక్కు కర్మాగారాన్ని 5 వేల కోట్ల రూపాయలకు కొట్టేసేలా జగన్, సదరు కంపెనీ ప్రతినిధులతో బేరసారాలు జరిపారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జగన్ చర్చల వ్యవహారం కేంద్ర పెద్దలకు ముందే తెలుసనన్న బొండా ఉమ, దానికనుగుణంగానే పార్లమెంట్లో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై ప్రకటన వెలువడిందని ఆక్షేపించారు. కేంద్రం ప్రకటించాక తనకేమీ తెలియనట్లు జగన్ లేఖలు రాస్తుంటే.. వైసీపీ ఎంపీలు తమకేమీ తెలియదన్నట్లు నిమ్మకు నీరెత్తినట్లుగా కూర్చున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి, వైకాపా ప్రభుత్వం దొంగనాటకాలను ప్రజలముందు ఎండగడుతూన్నారు. విశాఖ ఉక్కుఫ్యాక్టరీని కాపాడుకునేందుకు టీడీపీ పోరాటం చేస్తుందని బొండా ఉమ చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa