ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ నేతలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 09, 2021, 05:11 PM

అమరావతి భూముల అంశంపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. వాదనల సందర్భంగా టీడీపీ నేతలు ఈ కేసుకు సంబంధించిన నోటీసుల పట్ల కౌంటర్ దాఖలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతి భూ కుంభకోణంపై సిట్ ఏర్పాటు, అమరావతి భూములపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు అంశాలపై హైకోర్టు స్టే ఇవ్వగా, హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేస్తూ కౌంటర్ దాఖలు చేసేందుకు రెండు వారాల సమయం ఇచ్చింది. దాఖలు చేయని పక్షంలో తాము ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుందని తెలిపింది. తర్వాతి వారంలో రిజాయిండర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 5కి వాయిదా వేసింది. అదే రోజున పూర్తిస్థాయిలో వాదనలు వింటామని, దమ్మాలపాటి శ్రీనివాస్ కేసును కూడా అప్పుడే విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa