ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 10, 2021, 02:48 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మిషన్‌ బిల్డ్‌ ఏపీ అంశంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మిషన్‌ బిల్డ్‌ ఏపీ అంశంలో తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారని, ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ కుమార్‌ పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ పై బుధవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం విచారణ వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa