ఏపీలో డిగ్రీ విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ తెలిపారు. ఉన్నత విద్యపై కీలకనిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, ఏపీహెచ్ఈఆర్ఎంసీ ఛైర్ పర్సన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య, ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ కె హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని డిగ్రీకాలేజీల్లో ఇంగ్లిషు మీడియాన్ని ప్రవేశపెట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల మాదిరిగానే ఇంగ్లీష్ లో బోధించాలని సీఎం ఆదేశించారు.
ఇప్పటికిప్పుడే ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని..అలాంటి పరిస్థితి రాకుండా తగిన కోర్సులను తీసుకురావాలని సీఎం సూచించారు. డిగ్రీ మొదటి ఏడాదిలో దీనికి సంబంధించిన కోర్సులను ప్రవేశపెట్టాలని., అలాగే 11, 12 తరగతులుకూడా ఇంగ్లీష్ మీడియం చేర్చాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా పాఠ్యపుస్తకాలన్నీ ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ముద్రించాలని ఆదేశించారు. బీఎ, బీకాం లాంటి కోర్సులు చేసి.. ఇంగ్లిషులో మాట్లాడలేకపోతే.. విద్యార్థులు పోటీప్రపంచంలో రాణించడం కష్టమవుతుందని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.
అలాగే విద్యార్థుల కోసం ఆన్ లైన్ కోర్సులు తీసుకురావడంతో పాటు ప్రతి గ్రామానికీ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. దీంతోపాటు అమ్మ ఒడి, వసతి దీవెన పథకాల లబ్ధిదారులకు ఆప్షన్గా ల్యాప్టాప్లను సరసమైన ధరకు వచ్చేలా చూస్తున్నామన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విద్యారంగంలో, నైపుణ్య రంగంలో పెనుమార్పులను తీసుకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆన్లైన్ లెర్నింగ్ కోసం ఇంటర్నెట్లేని వైఫై ప్రోటోకాల్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జగన్ ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa