రాజస్థాన్ సూరత్గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రాజియాసర్ సమీపంలో గంగానగర్ వద్ద జాతీయ రహదారి-62పై ఓ ట్రక్కు, జీపు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa