ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో భారీగా కేసుల నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 17, 2021, 08:37 AM

ఏపీలో కరోనా కల్లోలం రేపుతోంది. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో 35,962 శాంపిల్స్ ని పరీక్షించగా 6,096 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 9,48,231 కి చేరింది. నిన్న 20 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య 7,373కి చేరింది. నిన్న మరణించినన వారిలో ఐదుగురు చిత్తురు జిల్లాకు చెందిన వారు కాగా, కృష్ణా జిల్లాలో ముగ్గురు, అనంతపూర్, వైఎస్ఆర్ కడప, కర్నూల్, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు చొప్పున మృత్యువాతపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa