ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ఫ్యూ టైం లో యువతి పనికి అంతా షాక్...!

national |  Suryaa Desk  | Published : Sat, Apr 17, 2021, 08:49 AM

కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అయితే ఆ నిబంధనలేవీ తమకు పట్టవు అన్నట్లుగా కొంత మంది వ్యవహరిస్తున్నారు. తాజాగా నైట్ కర్ఫ్యూ టైమ్ లో ఓ యువతి నడి రోడ్డుపై రచ్చ చేసింది. గుజరాత్ లోని రాజ్ కోట్ లో రాత్రిపూట కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. అయితే 25 ఏళ్ల యువతి పాయల్బ అలియాస్ ప్రిషా రాథోడ్‌ అనే యువతి ఈ రూల్ తనకో లెక్కా అనుకుందో ఏమో కాని ఏప్రిల్ 12న నైట్ కర్ఫ్యూ అమలవుతున్న సమయంలో రాజ్‌కోట్ వీధుల్లో డ్యాన్స్‌లు చేస్తూ నానా హంగామా చేసింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్ చేస్తున్న ఆ యువతి రాజ్‌కోట్‌లోని మహిళా కాలేజీ పక్కన రోడ్డుపై ఓ ఇంగ్లీష్ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. కరోనా టైమ్ లో ఈ రచ్చ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల వద్దకు చేరింది. దీంతో ఆమెపై రాజ్‌కోట్ ఏ-డివిజన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇలా లేట్ నైట్ వీడియోలను ఆమె తరచుగా ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేస్తుందని పోలీసుల విచారణలో బయటపడింది. వ్యవహారం రచ్చ కావడంతో ఆ యువతి దారికొచ్చింది. ఆ వీడియోను తన ఖాతా నుండి డిలీట్ చేయడంతో పాటు క్షమాపణలు కోరింది. అందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa