ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భక్తులకు టీటీడీ కీలక సూచనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 19, 2021, 10:14 AM

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కీలక సూచనలు చేసింది. జలుబు, జ్వరం, దగ్గుతో బాధపడుతున్న భక్తులు.. తిరుమల పర్యటనను వాయిదా వేసుకోవాలని సూచించింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించి, టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు.. రానున్న 90 రోజుల వరకు దర్శనానికి అనుమతి ఇస్తామన్నారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నందున దర్శనం విషయంలో వెసులుబాటు కల్పించామన్నారు.


కరోనా ఉధృతితో ఇప్పటికే టైంస్లాట్ టోకెన్ల కోటాను నిలిపివేసిన టీటీడీ.. ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా విడుదల చేసే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను కూడా తగ్గించే దిశగా ఆలోచన చేస్తోంది. మరోవైపు.. ఇవాళ సీఎం వైఎస్ జగన్ హైలెవల్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో.. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa