తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో AIADMK పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళణిస్వామి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో మహిళలకు నెలకు రూ.2,000 ఆర్థిక సాయం, నిరుపేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం, మహిళలకు ద్విచక్ర వాహనాలపై రూ.25,000 సబ్సిడీ వంటి కీలక హామీలు ఉన్నాయి. అంతేకాకుండా నగర బస్సుల్లో పురుషులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. ఈ హామీలతో AIADMK ఎన్నికల బరిలోకి దిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa