కర్నూలులో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి స్మారకంగా, జిల్లా రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఏకపాత్రాభినయ పోటీలు ఈనెల 18, 19 తేదీల్లో టీజీవి కళాక్షేత్రంలో జరగనున్నాయి. ఈ పోటీలలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 60 మందికి పైగా కళాకారులు పాల్గొంటారని నిర్వాహక కార్యవర్గ సభ్యులు తెలిపారు. మొదటి బహుమతిగా రూ. 5016తో పాటు మెమెంటో, ప్రశంసాపత్రం అందజేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa