ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనెల 19న జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రారంభించింది. 6.88 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలాల్లో నగదు జమచేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఐతే సీఎం జగన్ ప్రారంభించిన వెంటనే కొంతమంది అకౌంట్లలో నగదు జమయ్యాయి. కొంత మందికి మాత్రం ఇంకా జమ కాలేదు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు జమకావడానికి రెండువారాలు పట్టే అవకాశముంది. అందువల్ల విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అదికారులు చెప్తున్నారు.
విద్యార్థులు జ్ఞానభూమి https://jnanabhumi.ap.gov.in/ అనే వెబ్ సైట్ ఓపెన్ చేసి. స్టూడెంట్ ఆధార్, పాస్వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. అందులో వ్యూ/ప్రింట్ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో ఏ విద్యాసంవత్సరానికి సంబంధించిన స్టేటస్ తెలుసుకోవాలనుకుంటున్నారో అనేది ఎంచుకోవాలి. అందులో మీ స్టేటస్ ఎలిజిబుల్ అని ఓటీఏ కంప్లీటెడ్ అని చూపిసతే మీకు ఇంకా డబ్బులు రాలేదని అర్ధం. ఒకవేళ రిలీజ్డ్ అని చూపిస్తే మీకు నగదు వచ్చినట్లు అర్ధం. టీబీఆర్ నెంబర్ జనరేట్ అయిన వారం రోజుల తర్వాత మీ ఎకౌంట్లో డబ్బులు క్రెడిట్ అయ్యే అవకాశముంది. మీ దగ్గర టీబీఆర్ నెంబర్ ఉంటే పీఆర్డీసీఎఫ్ఎంఎస్ ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. కొంత మందికి తక్కువ డబ్బులు వచ్చి ఉండొచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa