ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంత్యక్రియల కోసం 200 ఎకరాలు సిద్ధం

national |  Suryaa Desk  | Published : Thu, Apr 22, 2021, 05:37 PM

కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటక ఒకటి. కన్నడ నాట కరోనా కలకలం రేపుతోంది. బెంగళూరులో కరోనా మృతులకు అంత్యక్రియలు చేయడానికి చోటు లేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కరోనా మృతుల అంత్యక్రియలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు పరిధిలో కరోనాతో చనిపోయిన అంత్యక్రియలు సజావుగా సాగేందుకు 200 ఎకరాలను సిద్ధం చేసింది. కురబరహళ్లి ప్రాంతంలోని 200 ఎకరాలలో కోవిడ్ మృతుల అంత్యక్రియలు నిర్వహించాలని యడియూరప్ప ప్రభుత్వం నిర్ణయించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa