కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. దీంతో గురువారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యారలయంలో సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ కొవిడ్ నివారణ, ఆస్పత్రుల్లో చికిత్స, ఆక్సిజన్ నిల్వలు తదిరత అంశాలపై చర్చించింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలు, ఆస్పత్రుల్లో పడకల సంఖ్య పెంపు, కోవిడ్ కేర్ కేంద్రాలను పెంచటం, రెమెడిసివిర్ ఇంజెక్షన్ లభ్యత, ఆక్సిజన్ కొరత లాంటి అన్ని అంశాలు చర్చించినట్లు సమావేశంలో ఆళ్లనాని తెలిపారు. కోవిడ్ నియంత్రణ కోసం, ప్రజలకు సందేహాలు నివృత్తి, ఫిర్యాదుల స్వీకరణ కోసం 104 కాల్ సెంటర్ ను మరింత బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. అలాగే దేశంలో కరోనా నియంత్రణ మందులు, ఆక్సిజన్ కొరత ఉందని.. ఏపీలోను ఇబ్బందులు ఉన్నపటికీ దాన్ని ఎదుర్కొనేందుకు కార్యాచరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా వేగంగా పూర్తి చేసే దుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతోందని.., ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఆక్సిజన్ ప్లాంట్ పెట్టేందుకు కేంద్రం సహకారం అందిస్తామని తెలిపిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa