ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేం సేకరించిన టీకాలు రాష్ట్రాలకు ఉచితంగానే: కేంద్రం

national |  Suryaa Desk  | Published : Sat, Apr 24, 2021, 12:27 PM

 కరోనా టీకాల పంపిణీపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేంద్రం కొనుగోలు చేసే వ్యాక్సిన్లను అన్ని రాష్ట్రాలకు ఉచితంగానే ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఉచిత వ్యాక్సిన్లపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టతనిచ్చింది. టీకా పంపిణీ విషయంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ లేవనెత్తిన అనుమానాలను కేంద్రం నివృత్తి చేసింది. ''కరోనా వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వం రూ.150కే కొనుగోలు చేస్తోంది. ఆ కొనుగోలు చేసిన టీకాలను రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తున్నాం. ఇకపై కూడా అదే కొనసాగుతుంది'' అని ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.


దేశంలో కరోనా మహమ్మారి ఉద్దృతి నేపథ్యంలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని కేంద్రం మరింత వేగవంతం చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మే 1వ తేదీ నుంచి 18ఏళ్ల పైబడిన వారందరూ టీకా తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అంతేగాన, వ్యాక్సిన్ల కొనుగోలులో రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పించింది. రాష్ట్రాలు, ప్రయివేటు కేంద్రాలు అదనపు డోసుల కోసం నేరుగా ఉత్పత్తిదారులను సంప్రదించొచ్చని తెలిపింది. టీకా తయారీదారులు తమ ఉత్పత్తిలో 50శాతం రాష్ట్రాలు, బహిరంగ మార్కెట్లో విక్రయించొచ్చని వెల్లడించింది.ఈ నేపథ్యంలో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవల కొవిషీల్డ్‌ కొత్త ధరలకు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు డోసుకు రూ. 400, ప్రయివేటు ఆసుపత్రులకు డోసుకు రూ. 600 చొప్పున విక్రయించనున్నట్లు తెలిపింది.


అయితే ఈ ధరలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒకే దేశం ఒకే పన్ను అని చెబుతూ ఒకే దేశం రెండు వ్యాక్సిన్ల ధరలా అంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్ర ఆరోగ్యశాఖ.. తాము రూ.150కు డోసులు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఇలా కొనుగోలు చేసిన వ్యాక్సిన్లను రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తున్నామని, ఇకమీదట కూడా అది కొనసాగిస్తామని స్పష్టం చేసింది. 45ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా టీకా వేసేందుకు 50శాతం టీకాలను ఉత్పత్తిదారుల నుంచి కేంద్రం సేకరించనున్న విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa