అమరావతి: ఏపీ కోవిడ్ కంట్రోల్ చైర్మన్గా కేఎస్ జవహర్ రెడ్డిని నియమించడం హర్షణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఒక్కరోజులో ఏపీలో 14,669 కరోనా పాజిటివ్ కేసులు, 71 మరణాలు సంభవించాయన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మిగిలిన విషయాలు పక్కన పెట్టి, కరోనా నియంత్రణ మాత్రమే సింగిల్ అజెండాగా పెట్టుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా పదో తరగతి, ఇంటర్ పరీక్షలను తక్షణమే రద్దు చేయాలన్నారు. కరోనా కట్టడికై వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa