ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏసీబీ వలలో తహసీల్దార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 30, 2021, 03:13 PM

ఏసీబీ దాడులు చేస్తున్నా లంచాలు తీసుకోవడానికి కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు వెనుకాడటం లేదు. పనుల కోసం వస్తున్న ప్రజలను లంచాల కోసం జలగల్లా పట్టిపీడిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా ముదిగుబ్బ తహశీల్దార్ అన్వర్ హుస్సేన్, వీఆర్వో చంద్రశేఖర్ లు ఏసీబీ వలలో అడ్డంగా బుక్కయ్యారు. రూ. 2 లక్షలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఓ రైతు భూమి ఆన్ లైన్ చేసేందుకు వీఆర్వో చంద్రశేఖర్ కు లంచం ఇవ్వాలని తహసీల్దార్ సూచించాడు. లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు వీఆర్వోను పట్టుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa