ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్పత్రికి వెళ్లకుండా కరోనాను జయించిన కుటుంబం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 19, 2021, 12:17 PM

ప్రకాశం జిల్లా ఒంగోలు రాజీవ్‌నగర్‌కు చెందిన కుటుంబం కరోనాను జయించింది. పాజిటీవ్ అనే మాట వినగానే ఆస్పత్రులకు పరుగులు పెట్టలేదు. ఆందోళన చెందలేదు. ప్రశాంతంగా ఇంట్లోనే ఉండి వైద్యం తీసుకున్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టారు. ధైర్యంకన్నా పెద్ద ఆయుధం ఏముంది? ముఖ్యంగా కరోనా సమయంలో ఉండాల్సింది అదే. చాలామందిలో ధైర్యం లేకపోవడంవల్లే వ్యాధి తీవ్రత పెరుగుతోంది. ఇలాంటి వారిలో ఒంగోలు రాజీవ్‌నగర్‌కు చెందిన కొత్తపల్లి శేషయ్య కుటుంబసభ్యులు ధైర్యం నింపుతున్నారు. ఆ కుటుంబంలో నలుగురు మహమ్మారిబారిన పడ్డారు. లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పటికీ ఆస్పత్రికి వెళ్లే ఆలోచన విరమించుకుని ఇంట్లోనే చికిత్స తీసుకున్నారు. 97 ఏళ్ల వృద్ధుడి నుంచి చిన్నారి వరకు అంతా కఠిన నిబంధనలు పాటించి కరోనాను తరిమికొట్టారు. 97 ఏళ్ల తన తండ్రి ఇచ్చిన ధైర్యమే కరోనాను జయించేలా చేసిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆహారపు అలవాట్లు, సరైన నిబంధనలు పాటిస్తే ఏమీ కాదని ధైర్యం చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa