ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆయుర్వేద మందుపై సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారు: ఆనందయ్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 23, 2021, 02:15 PM

ప్రజలకు మేలు చేసేందుకే మందు తయారుచేశానని ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ఆయుర్వేద ఔషధంపై సానుకూలంగా ఉన్నారు.. ప్రభుత్వం ఏం చెబితే అదే చేస్తామని ఆనందయ్య చెప్పారు. వేలమందికి మందు తయారు చేయాలంటే సమయం పడుతుందన్నారు. విశ్రాంత హెడ్‌మాస్టర్‌ కోటయ్యకు మందు వేసి నాలుగు రోజులైందని చెప్పారు. తన మందు వల్లే కోటయ్య ఇబ్బందిపడ్డారని చెప్పలేమన్నారు. తన మందును కొందరు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఆనందయ్య ప్రభుత్వాన్ని కోరారు.


ఆనందయ్య ఆయుర్వేద ఔషధంపై ఏపీ ఆయుష్ కమిషన్ పరిశీలన ముగిసింది. ఆయూష్ ప్రతినిధుల సమక్షంలో ఆనందయ్య మందును తయారు చేశారు. ఆనందయ్య ఎలాంటి హానికర పదాదార్థాలను వాడటం లేదని ఏపీ ఆయూష్ కమిషనర్ రాములు వెల్లడించారు. మందు తయారీలో హానికర పదార్థాలు లేవని రాములు వెల్లడించారు. ఆనందయ్య మందును నాటుమందుగానే పరిగణిస్తామని రాములు వెల్లడించారు. కళ్లలో వేసే డ్రాప్స్‌లో కూడా సాధారణ పదార్థాలే వాడుతున్నారని స్పష్టం చేశారు. అయితే ఆనందయ్య మందు రోగులపై పనిచేస్తుందా లేదా అనేది ఆయుర్వేద డాక్టర్ల బృందం తేల్చుతుందని రాములు వెల్లడించారు. డాక్టర్ల బృందం పరిశీలన అనంతరం తమ నివేదికను సీసీఆర్ఎఎస్‌కు పంపుతుందున్నారు. అన్ని నివేదికలు వచ్చిన తర్వాత మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం వస్తుందని రాములు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa