ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడపలో ఎర్రచందనం స్మగ్లర్ల ముఠా అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 01, 2021, 01:02 PM

కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల కోసం కడప ఎస్పీ అన్బురాజన్ ఆధ్వరంలో పోలీసుల బృందం తనిఖీలు చేపట్టారు. అక్రమంగా ఎర్రచందనాన్ని రవాణా చేస్తున్న తొమ్మిది మంది నిందితులను పట్టుకున్నారు. వారి దగ్గరి నుంచి 55 ఎర్రచందనం దుంగలు, కారు ,5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితులకు గతంలో కూడా నేర చరిత్ర ఉందని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఎవరైనా ఎర్రచందనం స్మగ్లింగ్‌కి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న వారిపై పీడీయాక్ట్‌లు పెడతామని, ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న వారిపై నిఘా పెంచామని కడప ఎస్పీ అన్బురాజన్ వివరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa