ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో గత 24 గంటల్లో 246 కరోనా పాజిటివ్ కేసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 08, 2021, 05:52 PM

ఏపీలో గడచిన 24 గంటల్లో 28,855 కరోనా పరీక్షలు నిర్వహించగా, 246 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 80 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 41, గుంటూరు జిల్లాలో 31 కేసులు గుర్తించారు. అనంతపురం జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.
అదే సమయంలో 334 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,401కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,68,487 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,50,720 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 3,366 మంది చికిత్స పొందుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa