ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి సుచరిత పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిబంధనలకు లోబడి మాత్రమే అమరావతి రైతులు పాదయాత్ర చేయాలని మేకతోటి సుచరిత స్పష్టం చేశారు.గుంటూరులో స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి జన్మదినం సందర్భంగా ఫీవర్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మేకతోటి సుచరిత, స్వామివారి విశిష్ట సేవలు దేశవ్యాప్తంగా అందుతున్నాయని పేర్కొన్నారు. స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని ఆమె కోరుతున్నారు. వేద పాఠశాలలో అనేక మంది విద్యార్థులు చదువుతూ సమాజసేవ చేస్తున్నారని మేకతోటి సుచరిత స్పష్టంచేశారు.రాజధాని అమరావతి రైతులు మహా పాదయాత్ర పేరుతో ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, నిబంధనల ఉల్లంఘన జరిగితే నోటీసులు ఇస్తామని మంత్రి మేకతోటి సుచరిత హెచ్చరించారు. రైతుల మహా పాదయాత్రకి నోటీసులు ఇవ్వడంపై క్లారిటీ ఇచ్చిన హోంమంత్రి సుచరిత కరోనా నిబంధనలు, లౌడ్ స్పీకర్ల పేరుతో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు పెట్రోల్, డీజిల్ ధరలు గతంలో ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉన్నాయి అంటూ ప్రశ్నించిన హోంమంత్రి సుచరిత పెట్రోల్ ధరలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని రాష్ట్ర పరిధిలో లేదని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa