విజయవాడ: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్రానికి రాక సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసి రోడ్షోలో స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. గనవ్నరం విమానాశ్రయం నుంచి ఓపెన్టాప్ జీపులో ర్యాలీగా బయల్దేరిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దారి పొడవునా అభివాదం చేసుకుంటూ ముందుకెళ్లారు. భద్రతా చర్యల్లో భాగంగా ఈ ర్యాలీని పై నుంచి డ్రోన్ కెమెరాతో పోలీసులు చిత్రీకరిస్తున్నారు.
ఏలూరు రోడ్డులోని ప్రభుత్వ ఆస్పత్రికి ర్యాలీ చేరుకోగానే.. రహదారి పక్కనున్న చెట్టు కొమ్మల్లో డ్రోన్ కెమెరా చిక్కుకుంది. దీన్ని తప్పించేందుకు ఆపరేటర్లు ప్రయత్నాలు చేస్తుండగానే వెంకయ్య ప్రయాణిస్తున్న వాహనం సమీపించింది. అదే సమయంలో పై నుంచి ఒక్కసారిగా డ్రోన్ కుప్పకూలింది. వెంకయ్యకు అతి సమీపంలోనే డ్రోన్ పడింది. దీంతో ప్రముఖులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. వూహించని పరిణామంతో భద్రతా అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఘటనతో డ్రోన్ పాక్షికంగా దెబ్బతినడంతో మరో పరికరాన్ని తెప్పించి చిత్రీకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa