ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబై వాసులకు టీ, టిఫిన్స్ అందించిన నేవీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 30, 2017, 01:56 PM

ముంబై: రెండు రోజులుగా ముంబై నగరాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి ముంబై, థానేతోపాటు పరిసర ప్రాంతాలు నీట మునిగిపోవడంతో వేలాదిమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వర్షాలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ముంబై వాసులకు ఇండియన్ నేవీ అధికారులు ఆహారాన్ని అందించారు. నేవీ అధికారుల బృందం ఇవాళ ఉదయం ఛత్రపతి శివాజీ టర్మినల్ రైల్వే స్టేషన్ వద్ద ముంబై వాసులకు ఛాయ్‌తోపాటు టిఫిన్స్ అందించింది. ఉదయం నుంచి వెయ్యి మందికి ఆహారాన్ని అందించామని, ప్రస్తుతం మరో 800 మంది అందిస్తున్నామని ఇండియన్ నేవీ కమాండర్ తెలిపారు. భారీ వర్షాలకు ఎక్కువ మంది నిరాశ్రయులయ్యారని..వారికి ఆహారాన్ని సరఫరా చేసేందుకు సన్నద్ధమవుతున్నామని కమాండర్ వెల్లడించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa