టోక్యో: రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్లోని నాగసాకిపై అమెరికా అణుబాంబు వేసింది. 1945, ఆగస్టు 9న ఆ దాడి జరిగింది. అయితే ఆ దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డ సుమితెరు తనిగుచి ఇవాళ తుది శ్వాస విడిచాడు. అతని వయసు 88 ఏళ్లు. అణు బాంబు దాడి జరిగినప్పుడు తనిగుచి వయసు 16 ఏళ్లు. అప్పుడు అతను పోస్ట్మ్యాన్గా పనిచేస్తున్నాడు. సైకిల్ మీద మెయిల్స్ ఇచ్చేందుకు వెళ్తున్న సమయంలో బాంబు దాడి జరిగింది. బాంబు పడిన కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో తనిగుచి ఉన్నాడు. అయితే బాంబు వల్ల వచ్చిన రేడియేషన్కు తనిగుచి గురయ్యాడు. ఒక్కసారిగా బాంబు రేడియేషన్ తాకడం వల్ల అతను సైకిల్ మీద నుంచి కిందపడిపోయాడు. వెన్ను, ఎడమ చేయి బాంబు వేడికి కాలిపోయాయి. సుమారూ మూడేళ్ల పాటు అతను హాస్పటల్లో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. అణుబాంబు దాడి బాధితుడైన తనిగుచి ఇన్నాళ్లూ మిగతా బాధితుల కోసం పోరాటం చేశాడు. నాగసాకిపై జరిగిన దాడిలో సుమారు 74 వేల మంది చనిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa