పాలకొండ : పాలకొండ గాయత్రీనగర్, బాబ్జీనగర్లో శుక్రవారం రెండు ఇళ్లల్లో చోరీఘటనలు చోటుచేసుకున్నాయి. గాయత్రీనగర్కు చెందిన పాండ్రంకి శంకరరావు, గూనాపు ఖగేశ్వరరావు ఇళ్లల్లో ఎవరూ లేని సమయంలో తాళాలు విరగ్గొట్టి గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడ్డారు.విషయం తెలుసుకున్న గృహ యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. సిఐ జి.శంకరరావు నేతృత్వంలో జిల్లా క్లూస్టీం, రేగిడి ఎస్ఐ మహ్మద్ ఆలీలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సదరు ఇళ్లల్లో బీరువాలు తెరిచి ఉండడాన్ని గుర్తించారు. ఈ ఘటనలో సుమారు ఆరు తులాల బంగారం చోరీకి గురైనట్టు బాధితులు అందించిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు. రెండు రోజులుగా అంతరాష్ట్ర దొంగల ముఠాలు హల్చల్ చేస్తున్నాయని పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయినప్పటికీ అజాగ్రత్త చోటుచేసుకుంటుందని పోలీసులు అంటున్నారు. ఇదిలా ఉంటే చోరీ ఘటనల్లో బాధితులిద్దరు ఉపాధ్యాయులు కావడం కొసమెరుపు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa