ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భక్తులకు టీటీడీ తీపి కబురు... 10 రోజులు పాటు వైకుంఠ ద్వారా దర్శనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 11, 2021, 09:48 PM

తిరుమల శ్రీవారి భక్తులకు తీపి కబురు తెలిపింది. జనవరి 13 న వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభమవుతుంది.వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 22వ తేది వరకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనున్నారు. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోడానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని భక్తులు ఆసక్తి చూపిస్తారు. ఏకాదశి, ద్వాదశి ఈ రెండు రోజులే వైకుంఠ ద్వారం తెరిచి ఉండటం వల్ల ఎక్కువ మందికి ఉత్తర ద్వార దర్శనం లభించడంలేదు. అందుకే టీడీడీ వైకుంఠద్వారం పది రోజుల పాటు తెరిచి ఉంచనుంది.ఇక వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన భక్తులకు ఉచితంగా దర్శనభాగ్యాం కల్పిస్తాం. భక్తులుకు శ్రీవేంకటేశ్వర నామ కోటి పుస్తకాలను అందిస్తాం. కళ్యాణకట్ట క్షురకులుకు ఇచ్చే పీస్ రేటును 11 నుంచి 15 రూపాయలకు పెంచాం. 3 కోట్ల రూపాయల వ్యయంతో వసతి గదుల్లో గీజర్లు ఏర్పాటు చేస్తాం. 10 కోట్ల రూపాయల వ్యయంతో స్విమ్స్ లో భవనాలు నిర్మాణం జరుగుతుంది. 12 కోట్ల రూపాయల వ్యయంతో మహిళా యూనివర్సిటీ లో హస్టల్ భవనాలు నిర్మాణం చేస్తాం అని తెలిపారు.
వర్షం కారణంగా అన్నమయ్య ప్రాజెక్ట్ వద్ద కోట్టుకుపోయిన ఆలయాలను తిరిగి పున:నిర్మిస్తాం. ఐటి విభాగాన్ని పటిష్టవంతంగా నిర్వహించేందుకు ఉద్యోగ నియామకాలు చేస్తాం. 2.6 కోట్ల రూపాయల వ్యయంతో నూతన పరకామణి మండపంలో యంత్రాలు కొనుగోలు చేసాం.శ్రీశైలం ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేస్తాం. తాళ్లపత్ర కందిరీగలను పరిరక్షించడానికి యస్వీ వేద విద్యాలయంలో మ్యాన్ స్ర్కిప్ట్ విభాగాని ఏర్పాటు చేస్తాం అని వైవి సుబ్బారెడ్డి అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa