ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రయాణికుల భద్రతే ఆర్పీఎఫ్‌ ధ్యేయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 12, 2021, 09:39 AM

రైల్వే ప్రయాణికులకు మెరుగైన భద్రత కల్పించడమే తమ ధ్యేయమని గుంటూరు డివిజన్‌ ఆర్పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ శరత్‌బాబు పేర్కొన్నారు. రేపల్లె రైల్వేస్టేషన్‌ ఆవరణలోని కార్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రైళ్లలో దొంగతనాలు జరక్కుండా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ప్రయాణ సమయంలో ప్రయాణికులు పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని సూచించారు. తొలుత స్టేషన్‌ పరిసరాలు, కార్యాలయ దస్త్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఎస్సై చంద్రశేఖర్‌, ఏసుపాదం, సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa