కరోనా కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్' వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వైద్యారోగ్య శాఖపై సీఎం జగన్ సోమవారం సమీక్షించారు. రాష్ట్రంలో మరో వారం రోజుల్లో జీన్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. ఫీవర్ సర్వే కొనసాగిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ నెలాఖరు నాటికి 144 పీఎస్ఏ ప్లాంట్లు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆరోగ్యశ్రీ సేవలను సమర్థంగా ఉపయోగించుకొనేందుకు ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ తెలిపారు.
కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, క్యాన్సర్ రోగులకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. 108, 104 వాహనాల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు ఉండకూడదని సీఎం తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకంపై సీఎం జగన్ ఆరా తీశారు. ఫిబ్రవరి నెలాఖరుకల్లా మొత్తం ప్రక్రియ ముగుస్తుందని అధికారులు తెలిపారు. ప్రతి ఆస్పత్రిలో బెడ్ల సంఖ్య, వైద్యులు సహా సిబ్బంది సంఖ్యను వివరిస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తోన్న సేవలపట్ల ప్రజలకు విశ్వాసం, నమ్మకం కలిగేలా ఆస్పత్రులను తీర్చిదిద్దాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa