ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి తెలుగు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటి పై ఉత్తర్వు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 14, 2021, 10:17 AM

ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు వినియోగించుకున్న వాటితో పాటు. ఈ నెల 15 వరకు అవసరాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ కోటాలో 236.13 TMCలు. తెలంగాణ కోటాలో 170.67 TMCల నీటిని K.R.M.B.ఆమోదించింది. ఈ నెల తొమ్మిదో తేదీన జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా... ఇప్పటి వరకు వినియోగించిన, ఈ నెల 15 వరకు అవసరాలకు సంబంధించి నీటి విడుదల ఉత్తర్వులు ఇచ్చింది. నవంబర్ నెలాఖరు వరకు కనీస నీటి వినియోగ మట్టంపైన. శ్రీశైలంలో 76.819 TMCలు, నాగార్జునసాగర్ లో 176.501 TMCలు ఉన్నట్లు... బోర్డు తెలిపింది. నవంబర్ నెలాఖరు వరకు AP 212.43 TMCల నీరు వినియోగించుకుందన్న కృష్ణా బోర్డు.. డిసెంబర్ ఒకటి నుంచి 15 వరకు మరో 23.68 TMCలకు అనుమతిచ్చింది. నవంబర్ నెలాఖరు వరకు తెలంగాణ 81.85 TMCల నీరు వినియోగించుకుందన్న K.R.M.B డిసెంబర్ ఒకటి నుంచి 15 వరకు మరో 88.82 TMCలకు అనుమతి ఇచ్చింది. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa