ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కృష్ణ జిల్లా పెడనలో దొంగ నోట్ల ప్రింటింగ్.. 9 మంది అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 14, 2021, 12:35 PM

ఏపీ లోని కృష్ణ జిల్లా పెడనలో దొంగ నోట్ల ప్రింటింగ్ కదొంగ నోట్ల ప్రింటింగ్ కలలకలం రేపింది, గుట్టు చప్పుడు కాకుండా ఈ బడా వ్యాపారం చేస్తున్నారు. ఒక లక్ష కు నాలుగు లక్షలు ఇస్తాం అంటూ ఆకర్షిస్తున్నారు. ఈ వ్యాపారంలో మధ్య వర్తులకు 40 పర్శంటేజ్ కమిషన్ కూడా ఇస్తున్నారు. ఈ కృష్ణ జిల్లా పెడనలో దొంగ నోట్ల ప్రింటింగ్.. వ్యాపారం లో ఇప్పటివరకు స్కానర్లు, ప్రింటింగ్ మెషీన్స్ ఇంకా 9 మంది ని అరెస్ట్ చేసినట్టు సమాచారం. వారి వద్ద నుండి పెడన పోలీసులు 3 లక్షల రూపాయల దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు.
 పట్టణంలోని వీరభద్రపురంకు చెందిన ఓ తండ్రి కొడుకులు కాసా నాగరాజు, కొడుకు చందు నకిలీ నోట్లను ముద్రించి చాలా మందికి చలామణి చేస్తున్నారు.
పట్టణంలోని 20 వార్డు రామలక్ష్మి కాలనీకి చెందిన వ్యక్తి వాసా వెంకటేస్వారావు మీడియేటర్ గా వ్యవహరిస్తూ ఈ నోట్లను చలామణి చేస్తున్నారు. అసలు నోట్లు లక్ష ఇస్తే.. నాలుగు లక్షల రూపాయలు నకిలీ నోట్లు ఇస్తామని ఆఫర్ ఇస్తున్నాడు. ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ మురళి అప్రమత్తమై సోమవారం తెల్లవారుజామున దాడులు ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa