ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోర రోడ్డు ప్రమాదం.. లెక్చరర్ మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 14, 2021, 01:57 PM

ప్రకాశం: మార్టూరు సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక లెక్చరర్ దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళితే. మార్టూరు మండలం నాగరాజు పల్లి తండాకు చెందిన భూక్యా వెంకటేశ్వర్లు నాయక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు జూనియర్ ఇంగ్లీష్ లెక్చరర్ గా పని చేస్తున్నారు. ఆయన బైక్ పై కాలేజీ కి వస్తున్న సందర్భంగా లారీ డ్రైవర్ అజాగ్రత్తగా అతి వేగంగా డ్రైవింగ్ చేస్తూ ముందు వెళుతున్న కాలేజీ లెక్చరర్ బైకును ఢీ కొనగా మోటార్ సైకిల్ పై నుండి కిందపడి తల పగిలి అక్కడికక్కడే చనిపోయాడు.


ఈ విషయాన్ని స్థానికులు గమనించి మార్టూరు పోలీసులకు సమాచారాన్ని ఇవ్వగా వెంటనే స్పందించిన మార్టూరు ఎస్ఐ రవీంద్రారెడ్డి తన సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్ళి లారీ డ్రైవర్ నిఅదుపులోకి తీసుకొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ఏరియా ఆసుపత్రికి పంపించారు. మృతురాలి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్సై రవీంద్రారెడ్డి తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa