ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో కొత్తగా 6984 కరోనా పాజిటివ్ కేసులు

national |  Suryaa Desk  | Published : Wed, Dec 15, 2021, 10:27 AM

భారత్ లో కరోనా రోజూ వారీ కేసులు ఒక రోజు తగ్గితే మరో రోజు కొద్దిగా పెరుగుతున్నాయి. అంటే సాధారణంగా నమోదు అవుతున్నాయి. సాధారణంగా  భారత్ లో రోజుకు 10 వేల కన్నా తక్కువ కరోనా కేసులు.. మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా  దేశంలో కొత్తగా 6,984 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా మరో 247 మంది మరణించారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
గడిచిన 24 గంటల్లో మొత్తం 8,168 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 87,562 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇదే కాలంలో ఇప్పటివరకు మొత్తం 134.61 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa