రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన, శాశ్వత భవన నిర్మాణ పనులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. 2027 నాటికి ఈ ఐకానిక్ భవనాన్ని పూర్తి చేయడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.రాఫ్ట్ ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైకోర్టు భవనాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. రెండు బేస్మెంట్ అంతస్తులు, గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మరో 7 అంతస్తులతో ఈ నిర్మాణం ఉంటుందని వివరించారు.సుమారు 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 52 కోర్టు హాళ్లతో ఈ భవనాన్ని డిజైన్ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ భారీ నిర్మాణం కోసం దాదాపు 45 వేల టన్నుల స్టీల్ను వినియోగిస్తున్నట్లు చెప్పారు. హైకోర్టు పనులు ప్రారంభం కావడం రాజధాని నిర్మాణంలో ఒక చారిత్రక ఘట్టమని మంత్రి నారాయణ అభివర్ణించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa