ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోర ప్రమాదం: చూస్తుండగానే 50 మంది సజీవ దహనం

international |  Suryaa Desk  | Published : Wed, Dec 15, 2021, 10:53 AM

పోర్ట్ ఓ ప్రిన్స్: హైతీలో గ్యాస్ ట్యాంకర్ పేలుడు సంభవించింది. మంగళవారం  హైతియన్ సిటీలో గల కాప్ హైతియన్‌లో ఈ ఘోరం చోటు చేసుకుంది.ఘటనా స్థలంలో సుమారు 50 నుంచి 54 మంది సజీవ దహనమవడం చూసినట్లు డిప్యూటీ మేయర్ పాట్రిక్ అల్మోనోర్ చెప్పారు. మృతి చెందిన వారిని గుర్తించడం అసాధ్యంగా మారిందని, మరో వైపు పేలుడు కారణంగా ఆ ప్రాంతంలోని సుమారు 20 ఇళ్లు కాలిపోయాయని అల్మోనోర్ చెప్పారు.ఆ ఇళ్లలో ఉన్న బాధితుల సంఖ్యపై తాము ఇప్పుడే వివరాలు చెప్పలేమని ఆయన అన్నారు. క్షతగాత్రులను సదుపాయానికి తరలించడంతో సమీపంలోని జస్టినియన్ యూనివర్శిటీ ఆసుపత్రి రోగులతో కిక్కిరిసిపోయింది. తీవ్రంగా కాలిపోయిన వ్యక్తుల సంఖ్య పెరగడంతో చికిత్స చేయడం కష్టంగా మారుతోందని వైద్యులు చెప్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa