ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనంతలో మరో అన్నదాత ఆత్మహత్య!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 15, 2021, 01:53 PM

అనంతపురం జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. బుక్కరాయసముద్రం మండలం సంజీవ్ పురం గ్రామానికి చెందిన గంగాధర్ (45) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకు భార్య, కుమార్తె కుమారుడు ఉన్నారు. నార్పల మండల కేంద్రానికి సమీపంలో ఉన్న క్రాసింగ్ లో సమీప పొలాల్లో ఆయన ఈ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోవడం తోనే ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు అని భావిస్తున్నారు. స్థానిక ఎస్సై వెంకటప్రసాద్ పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa