ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖపట్నం ప్రజలకు ముఖ్య గమనిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 15, 2021, 04:09 PM

విశాఖపట్నం జిల్లాలోని శ్రీశ్రీశ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసం రెండవ లక్ష్మి వారం సందర్భంగా బుధవారం అర్ధరాత్రి నుండి దర్శనం కోసం ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని పోలీసు వారు తెలిపారు. కావున ఆ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని కావున ఆ మార్గం గుండా ప్రయాణించే సాదారణ వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ప్రయాణించాలని పోలీస్ శాఖ ప్రకటించారు.


అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించి, వారి వాహనాలను ఈ క్రింద కేటాయించిన స్థలములో పార్కింగ్ చేయవలసినదిగా ట్రాఫిక్ పోలీస్ వారు విజ్ఞప్తి చేశారు.


జగదాంబ జంక్షన్ నుండి పూర్ణ మార్కెట్ మీదుగా వచ్చే అన్ని వాహనాలు (2 వీలర్/3&4వీలర్) సున్నపు వీధి జంక్షన్ వద్ద కుడి వైపుకు తిరిగి మునిసిపల్ స్టేడియం లోపల పార్కింగ్ చేసుకోవలెను.


పాత పోస్ట్ ఆఫీస్ నుండి టౌన్ మీదుగా వచ్చే అన్ని వాహనాలు (2 వీలర్/3&4వీలర్) కురుపాం మార్కెట్ వద్ద ఎడమ వైపుకు తిరిగి యం.వి.డి.యం. స్కూల్ వద్ద పార్కింగ్ చేసుకోవలెను.


జగదాంబ జంక్షన్ నుండి పూర్ణ మార్కెట్ మీదుగా వచ్చు ఆర్టీసీ బస్సులు సున్నపు వీధి జంక్షన్ వద్ద కుడి వైపుకు తిరిగి గోపాల్ ఆటో వద్ద భక్తులను దింపి, ఆర్టీసీ బస్సులు పాత పోస్ట్ ఆఫీస్ వైపు వెళ్ళవలెనాని సీఏ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa