ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ గా సైన్యాధిపతి జనరల్ నరవణెకు బాధ్యతలు

national |  Suryaa Desk  | Published : Thu, Dec 16, 2021, 12:16 PM

చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ గా సైన్యాధిపతి జనరల్ M.M. నరవణె బాధ్యతలు చేపట్టారు. సాధారణంగా ఈ కమిటీకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్.  ఛైర్మన్ గా ఉంటారు. ప్రస్తుత CDS జనరల్ బిపిన్ రావత్ మరణంతో ఖాళీగా ఉన్న ఈ స్థానంలో త్రివిధ దళాల అధిపతుల్లో సీనియర్ అయిన నరవణెను కమిటీ ఛైర్మన్ గా నియమించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. CDS పదవిని సృష్టించక ముందు మూడు దళాల అధిపతుల్లో సీనియర్ గా ఉన్న వ్యక్తి ఛైర్మన్ గా వ్యవహరించేవారు. ఆర్మీ, వాయుసేన, నావికా దళాల అధ్యక్షులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఎయిర్ చీఫ్ మార్షల్ VR చౌధరి సెప్టెంబర్ 30న వాయుసేనాధిపతిగా బాధ్యతలు స్వీకరించగా. నేవీ చీఫ్ గా అడ్మిరల్ R.హరికుమార్.నవంబర్ 30న పదవిలోకి వచ్చారు. జనరల్ నరవణె మాత్రం.2019 డిసెంబర్ నుంచి ఆర్మీ చీఫ్ గా కొనసాగుతున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa