ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి సేవలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 02, 2017, 11:25 AM

తిరుమల: తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు శనివారం ఉదయం దర్శించుకున్నారు. గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి పద్మావతి విశ్రాంతి సముదాయం నుంచి ఉదయం 7 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమల సన్నిధికి చేరుకున్నారు. తిరుమల క్షేత్ర సంప్రదాయం పాటిస్తూ మొదటగా శ్రీవరాహ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం బ్యాటరీ వాహనంలో శ్రీవారి ఆలయం మహాద్వారం వద్దకు చేరుకున్నారు. తితిదే ఉన్నతాధికారులు, అర్చకులు ఇఫ్తికపాల్‌ స్వాగతం పలికి, స్వామివారి సన్నిధికి రాష్ట్రపతి దంపతులను తీసుకెళ్లారు. దర్శనం అనంతరం కోవింద్‌కు స్వామి వారి శేషవస్త్రాన్ని బహూకరించారు. ఆనంద నిలయం నుంచి ప్రదక్షిణగా వస్తూ హుండీలో రాష్ట్రపతి కానుకలు సమర్పించారు. శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభానికి మొక్కి రంగనాయక మండపానికి చేరుకున్నారు. ఇక్కడ పండితులు రాష్ట్రపతి కుటుంబసభ్యులకు వేదాశీర్వచనం చేశారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్‌, సీఎంలకు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాలను తితిదే బహూకరించింది. గంట పాటు శ్రీవారి ఆలయంలో రాష్ట్రపతి గడిపారు. అనంతరం పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa