ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిర్‌ఇండియా బంపర్‌ ఆఫర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 02, 2017, 11:46 AM

ఎయిర్‌ ఇండియా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. దేశీయ విమానాల్లో ఎకనామీ తరగతి టికెట్లపై 50 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ ఆఫర్‌ సైనికులు, సీనియర్‌ సిటిజన్స్‌, విద్యార్థులకు వర్తించనున్నట్లు తెలిపింది. ఈ అవకాశాన్ని పొందాలంటే ప్రయాణానికి ఏడు రోజుల ముందుగానే టికెట్‌ బుక్‌ చేసుకోవాలి. ఈ మేరకు ఎయిర్‌ఇండియా ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. అయితే ఈ ఆఫర్‌ ఎప్పటి వరకు ఉంటుందనేది ఎయిర్‌ఇండియా తెలపలేదు. ఎయిర్‌ ఇండియా అధికార వెబ్‌సైట్‌, కార్యాలయాల్లో టికెట్లను పొందవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa